పుణ్యక్షేత్రాల్లో చిరంజీవి పేరిట పూజలు...
- November 05, 2016
మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తరువాత వెండితెర మీదికి రీ ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానవుల్లో ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం బయటికొచ్చింది. 'ఖైధీ నెం 150' సినిమా షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి సినిమాకి సంబందించిన ప్రతి చిన్న విషయాన్నీ ఆసక్తిగా గమనిస్తున్నారు. సినిమా ఎలాగైనా భారీ విజయం సాధించి చిరు పునరాగమనం దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే తమ వంతు భాద్యతగా సినిమా విజయం కోసం అన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా అయినవిల్లి లోని గణపతి ఆలయంలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రావణం స్వామి నాయుడు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు ఏడిద శ్రీను తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే దేశంలోని 6 ప్రధాన పుణ్యక్షేత్రాల్లో చిరంజీవి పేరిట పూజలు చేస్తామని, సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని వారన్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









