పుణ్యక్షేత్రాల్లో చిరంజీవి పేరిట పూజలు...
- November 05, 2016
మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తరువాత వెండితెర మీదికి రీ ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానవుల్లో ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం బయటికొచ్చింది. 'ఖైధీ నెం 150' సినిమా షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి సినిమాకి సంబందించిన ప్రతి చిన్న విషయాన్నీ ఆసక్తిగా గమనిస్తున్నారు. సినిమా ఎలాగైనా భారీ విజయం సాధించి చిరు పునరాగమనం దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే తమ వంతు భాద్యతగా సినిమా విజయం కోసం అన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా అయినవిల్లి లోని గణపతి ఆలయంలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రావణం స్వామి నాయుడు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు ఏడిద శ్రీను తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే దేశంలోని 6 ప్రధాన పుణ్యక్షేత్రాల్లో చిరంజీవి పేరిట పూజలు చేస్తామని, సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని వారన్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







