అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి విజయం..

- November 08, 2016 , by Maagulf
అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి విజయం..

అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి విజయం సాధించారు. తమిళనాడుకు చెందిన ఆయన.. డెమోక్రటిక్‌ పార్టీ తరపున ఇల్లినాయిస్‌ రాష్ట్రం నుంచి యూఎస్‌ హౌస్‌కు ఎంపికయ్యారు. అమెరికా కాంగ్రెస్‌కు వెళ్లబోతున్న తొలి తమిళ వ్యక్తి రాజా కృష్ణమూర్తి. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కు వెళ్తున్న తొలి భారత సంతతి హిందూ వ్యక్తి కూడా ఆయనే.రాజా కృష్ణమూర్తి పుట్టింది ఢిల్లీ అయినా, పేరెంట్స్‌ది మాత్రం తమిళనాడు. చిన్నవయసులో అమెరికా వెళ్లిన రాజా కృష్ణమూర్తి ఫ్యామిలీ అక్కడే స్థిరపడింది. ఆయన ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత హార్వర్డ్‌ లా స్కూల్‌ నుంచి జ్యూరిస్‌ డాక్టరేట్‌ తీసుకున్నారు.ఆయన ప్రస్తుతం శివనాథన్‌ ల్యాబ్స్‌ అండ్‌ ఎపిసోలార్‌ కంపెనీ ప్రెసిడెంట్‌. 2004లో ప్రస్తుతం అధ్యక్షుడు ఒబామా ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com