కొత్త డిజైన్, కొత్త రంగుతో వెయ్యి రూపాయల నోటు...
- November 10, 2016
మరిన్ని భద్రతా ప్రమాణాలతో కొత్త వెయ్యి రూపాయల నోటును త్వరలోనే తీసుకొస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంత దాస్ మీడియాతో మాట్లాడారు. మరికొద్ది నెలల్లో కొత్త డిజైన్, కొత్త రంగుతో వెయ్యి రూపాయల నోటును అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా బ్యాంకుల శాఖ, ఆర్బీఐ అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు. ప్రజల అవసరాలకు సరిపడా కరెన్సీని వెంటనే అందుబాటులోకి తీసుకొస్తామని... ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. సాధారణ పౌరులు కొనుగోళ్లు చేసేందుకు కొద్దిరోజుల పాటు ఇబ్బంది ఎదురైనప్పటికీ...దీర్ఘకాలికంగా దేశానికి లబ్ది చేకూరుతుందన్నారు. ప్రభుత్వానికి తెలపకుండా భారీ మొత్తంలో డబ్బు పోగేసిన వారిపైనే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ప్రజల కొనుగోలు అలవాట్లు ప్రభావితం కాగలవని జైట్లీ పేర్కొన్నారు. పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించిన తరువాత వెయ్యి రూపాయల నోటును కొనసాగిస్తారా లేదా అన్ని దానిపై సందేహం నెలకొన్న సంగతి తెలిసిందే.రూ.1000 నోట్లు నిలిపివేసి రూ.2000 నోట్లు తీసుకురావడం ద్వారా అవినీతిని ఎలా నిర్మూలిస్తారని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించిన నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా ప్రకటన విడుదల చేయడం విశేషం.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







