భారతీయుల్లో అత్యధికులు బీ12 విటమిన్ లోపంతో బాధపడుతున్నారు
- November 10, 2016
శాకాహారమే బెస్ట్ అని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. కానీ తాజా అధ్యయనంలో శాకాహారుల్లో బీ12 విటమిన్ లోపం తలెత్తుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
32 ఏళ్ళ నుపుర్ డే స్వోరే అని మహిళ బరువు కోల్పోవడం, పాదాలలో చురుకులు వంటి సమస్యలు ఎదుర్కొంది. ఆమె ఫక్తు శాకాహారి. డాక్టర్ వద్దకు వెళ్ళగా పలు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
దాంట్లో, ఆమెకు బి12 విటమిన్ లోపం ఉన్నట్టు తేలింది. దీనిపై, మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్స్ కన్సల్టెంట్ అనిల్ అరోరా మాట్లాడుతూ, స్వచ్ఛమైన శాకాహారం తీసుకునే భారతీయుల్లో అత్యధికులు బీ12 విటమిన్ లోపంతో బాధపడుతున్నారని వివరించారు.
గుడ్లు, మాంసం, పాల ఉత్పత్తులను తగినంత స్థాయిలో తీసుకోకపోతే శరీరానికి అవసరమైన స్థాయిలో బీ12 విటమిన్ లభించదని ఆమె తేల్చి చెప్పేశారు. సో.. శాకాహారానికే పరిమితం కాకుండా వారానికి రెండు లేదా ఒక్కసారైనా మాంసాహారం కూడా తీసుకోవడం ఉత్తమం.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









