భారతీయుల్లో అత్యధికులు బీ12 విటమిన్ లోపంతో బాధపడుతున్నారు

- November 10, 2016 , by Maagulf
భారతీయుల్లో అత్యధికులు బీ12 విటమిన్ లోపంతో బాధపడుతున్నారు

శాకాహారమే బెస్ట్ అని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. కానీ తాజా అధ్యయనంలో శాకాహారుల్లో బీ12 విటమిన్ లోపం తలెత్తుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 
 
32 ఏళ్ళ నుపుర్ డే స్వోరే అని మహిళ బరువు కోల్పోవడం, పాదాలలో చురుకులు వంటి సమస్యలు ఎదుర్కొంది. ఆమె ఫక్తు శాకాహారి. డాక్టర్ వద్దకు వెళ్ళగా పలు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 
 
దాంట్లో, ఆమెకు బి12 విటమిన్ లోపం ఉన్నట్టు తేలింది. దీనిపై, మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్స్ కన్సల్టెంట్ అనిల్ అరోరా మాట్లాడుతూ, స్వచ్ఛమైన శాకాహారం తీసుకునే భారతీయుల్లో అత్యధికులు బీ12 విటమిన్ లోపంతో బాధపడుతున్నారని వివరించారు. 
 
గుడ్లు, మాంసం, పాల ఉత్పత్తులను తగినంత స్థాయిలో తీసుకోకపోతే శరీరానికి అవసరమైన స్థాయిలో బీ12 విటమిన్ లభించదని ఆమె తేల్చి చెప్పేశారు. సో.. శాకాహారానికే పరిమితం కాకుండా వారానికి రెండు లేదా ఒక్కసారైనా మాంసాహారం కూడా తీసుకోవడం ఉత్తమం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com