మక్కాలో తెలుగువారి పరేషాన్....
- November 10, 2016
నోట్ల పాట్లు భారతదేశంలో ఉన్నవారికే కాదు విదేశాల్లో ఉన్న మన పర్యాటకులకూ తప్పడంలేదు. పాత కరెన్సీ చెల్లకపోవడంతో వారు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మక్కా పర్యటనకు వచ్చిన తెలుగు రాష్ట్రాల యాత్రికుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పెద్దపల్లి జిల్లా మొహ్మద్ జాహేద్, మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన డాక్టర్ అబ్దుల్ అజీజ్ సహా కొన్ని వందల మంది మక్కాలో ఉన్నారు. వీరందరి దగ్గర పాత 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. వాటిని స్వీకరించడానికి స్థానిక మనీ ఎక్సేంజిలు నిరాకరిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.వీరిని తీసుకోవచ్చిన టూర్ ఆపరేటర్లు కూడా నోట్ల మార్పిడికి నిరాకరిస్తున్నారు. భారతీయ కరెన్సీ నోట్లను మార్పిడి చేయడానికి తమకు అధికారం లేదని దుబాయిలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ వి.దుర్గా ప్రసాద్ చెప్పారు
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









