మక్కాలో తెలుగువారి పరేషాన్....
- November 10, 2016
నోట్ల పాట్లు భారతదేశంలో ఉన్నవారికే కాదు విదేశాల్లో ఉన్న మన పర్యాటకులకూ తప్పడంలేదు. పాత కరెన్సీ చెల్లకపోవడంతో వారు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మక్కా పర్యటనకు వచ్చిన తెలుగు రాష్ట్రాల యాత్రికుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పెద్దపల్లి జిల్లా మొహ్మద్ జాహేద్, మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన డాక్టర్ అబ్దుల్ అజీజ్ సహా కొన్ని వందల మంది మక్కాలో ఉన్నారు. వీరందరి దగ్గర పాత 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. వాటిని స్వీకరించడానికి స్థానిక మనీ ఎక్సేంజిలు నిరాకరిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.వీరిని తీసుకోవచ్చిన టూర్ ఆపరేటర్లు కూడా నోట్ల మార్పిడికి నిరాకరిస్తున్నారు. భారతీయ కరెన్సీ నోట్లను మార్పిడి చేయడానికి తమకు అధికారం లేదని దుబాయిలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ వి.దుర్గా ప్రసాద్ చెప్పారు
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







