మక్కాలో తెలుగువారి పరేషాన్‌....

- November 10, 2016 , by Maagulf
మక్కాలో తెలుగువారి పరేషాన్‌....

నోట్ల పాట్లు భారతదేశంలో ఉన్నవారికే కాదు విదేశాల్లో ఉన్న మన పర్యాటకులకూ తప్పడంలేదు. పాత కరెన్సీ చెల్లకపోవడంతో వారు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మక్కా పర్యటనకు వచ్చిన తెలుగు రాష్ట్రాల యాత్రికుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పెద్దపల్లి జిల్లా మొహ్మద్‌ జాహేద్‌, మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన డాక్టర్‌ అబ్దుల్‌ అజీజ్‌ సహా కొన్ని వందల మంది మక్కాలో ఉన్నారు. వీరందరి దగ్గర పాత 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. వాటిని స్వీకరించడానికి స్థానిక మనీ ఎక్సేంజిలు నిరాకరిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.వీరిని తీసుకోవచ్చిన టూర్‌ ఆపరేటర్లు కూడా నోట్ల మార్పిడికి నిరాకరిస్తున్నారు. భారతీయ కరెన్సీ నోట్లను మార్పిడి చేయడానికి తమకు అధికారం లేదని దుబాయిలోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ హైదరాబాద్‌ మేనేజర్‌ వి.దుర్గా ప్రసాద్‌ చెప్పారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com