నేడు జపాన్ ప్రధాని ఆబెతో మోదీ చర్చలు...
- November 10, 2016
ప్రధాని నరేంద్ర మోదీ తన జపాన్ పర్యటనలో భాగంగా గురువారం టోక్యో చేరుకున్నారు. జపాన్ రాజధానిలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. శుక్ర, శనివారాలలో జపాన్ ప్రధాని షింజో ఆబె, చక్రవర్తి అకిహిటో, జపాన్ వాణిజ్య కంపెనీల అధిపతులతో విడివిడిగా చర్చలు జరపనున్నారు. జపాన్తో 12 ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు, కీలకమైన పౌర అణుఒప్పందంపై భారత్ సంతకాలు చేసే అవకాశం ఉంది. భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్య అభివృద్ధి, మౌలిక సౌకర్యాల అభివృద్ధి తదితర రంగాలలో సహకారాన్ని విస్తృతం చేసుకోవడంపై శుక్రవారం ఆబెతో చర్చలు జరుపుతారు.
కాగా, మోదీ టోక్యో వెళుతూ గురువారం మార్గమధ్యంలో థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఆకస్మికంగా ఆగారు. గత నెలలో కనుమూసిన థాయ్ చక్రవర్తి భూమిబోల్ అదుల్యదేజ్కు ఘనంగా నివాళులర్పించారు
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







