భారత కరెన్సీ మార్పిడి - మీరేం చెయ్యాలి?
- November 11, 2016
భారత ప్రధాని నరేంద్రమోడీ 500 మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కొత్త నోట్ల వినియోగంపై ప్రకటన చేసిన వెంటనే భారతదేశంలోనివారే కాకుండా, విదేశాల్లోనివారు కూడా షాక్కి గురయ్యారు. అయితే ఆర్బిఐ పాత నోట్ల మార్పిడికి కొంత వెసులుబాటు కల్పించింది. ఇది విదేశాల్లోని భారతీయులకూ వర్తిస్తుంది. విదేశాల్లోని భారతీయ బ్యాంకులు రద్దు చేయబడిన పాత నోట్లను స్వీకరించాల్సి ఉంటుంది ఆర్బిఐ గైడ్ డైన్స్ ప్రకారం. కాబట్టి ఆ పాత నోట్లు ఉన్నవారు భారతీయ బ్యాంకులకు వెళ్ళి మార్చుకుంటే సరిపోతుంది. డిసెంబర్ 30 లోపు ఇండియా వెళ్ళాలనుకుంటే సమస్యే లేదు, వెళ్ళిన తర్వాత వాటిని మార్చుకోవచ్చు. మీరు వెళ్ళని పక్షంలో మీ స్నేహితులకు మీ వద్ద ఉన్న పాత నోట్లను ఇచ్చి వారు ఇండియాకి వెళితే మార్పించుకోవచ్చు. డిసెంబర్ 30 తర్వాత గనుక మీరు ఇండియాకి వెళితే ఆర్బిఐలో పాత నోట్లను మార్చుకునే అవకాశం కూడా ఉంది. డిపాజిట్ చేయడానికి పరిమితుల్లేవుగానీ, నోట్లను మార్చుకోడానికి మాత్రం కేవలం 4 వేల వరకే అనుమతినిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







