గేమింగ్ రంగానికి హబ్గా హైదరాబాద్
- November 11, 2016
గేమింగ్ రంగానికి హైదరాబాద్ అతి పెద్ద హబ్గా మారనుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గేమింగ్, మల్టీమీడియా రంగానికి తమ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తోందన్నారు. హెచ్ఐసీసీలో నాస్కాం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నాస్కాం గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్-2016ను ఆయన ప్రారంభించారు. వందకు పైగా పేరున్న గేమింగ్ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయని తెలిపారు. బాహుబలి, మగధీర, ఈగ, లైఫ్ ఆఫ్ పై లాంటి విజువల్ ఎఫెక్ట్స్ చిత్రాల నిర్మాణం హైదరాబాద్లోనే జరిగిందన్నారు. త్వరలో టీహబ్ రెండో దశ భవనాన్ని నిర్మిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అనంతరం భారత్లో నెదర్లాండ్స్ రాయబారి మాట్లాడుతూ.. భారత్లో గేమింగ్ రంగానికి చక్కని భవిష్యత్తు ఉందన్నారు. ఈ రంగంలో మరింత పురోగతి కోసం భారత్ కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాస్కాం ఛైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, ఎన్జీడీసీ ఛైర్మన్ రాజేశ్రావు, దేశ విదేశాల నుంచి వచ్చిన గేమ్ డెవలపర్లు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







