గేమింగ్ రంగానికి హబ్గా హైదరాబాద్
- November 11, 2016
గేమింగ్ రంగానికి హైదరాబాద్ అతి పెద్ద హబ్గా మారనుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గేమింగ్, మల్టీమీడియా రంగానికి తమ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తోందన్నారు. హెచ్ఐసీసీలో నాస్కాం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నాస్కాం గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్-2016ను ఆయన ప్రారంభించారు. వందకు పైగా పేరున్న గేమింగ్ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయని తెలిపారు. బాహుబలి, మగధీర, ఈగ, లైఫ్ ఆఫ్ పై లాంటి విజువల్ ఎఫెక్ట్స్ చిత్రాల నిర్మాణం హైదరాబాద్లోనే జరిగిందన్నారు. త్వరలో టీహబ్ రెండో దశ భవనాన్ని నిర్మిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అనంతరం భారత్లో నెదర్లాండ్స్ రాయబారి మాట్లాడుతూ.. భారత్లో గేమింగ్ రంగానికి చక్కని భవిష్యత్తు ఉందన్నారు. ఈ రంగంలో మరింత పురోగతి కోసం భారత్ కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాస్కాం ఛైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, ఎన్జీడీసీ ఛైర్మన్ రాజేశ్రావు, దేశ విదేశాల నుంచి వచ్చిన గేమ్ డెవలపర్లు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









