దుబాయ్లో మృతిచెందిన ఉగండా మహిళ
- November 11, 2016
ఉగండాకి చెందిన మహిళ, రియాద్ నుంచి స్వదేశానికి వెళుతుండగా, మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయింది. అయితే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె ప్రాణాలు కోల్పోయిందన్న వార్తల్ని విమానాశ్రయ సిబ్బంది ఖండించారు. అనారోగ్యంతో ప్రయాణించలేని పరిస్థితుల్లో ఉన్న ఆమె ఆసుపత్రికి తరలించబడిందనీ, అనంతరనం ఆమె ఆసుపత్రిలో మృతి చెందిందని వారు స్పష్టం చేశారు. ఆమె వద్దనున్న మెడికల్ రిపోర్ట్స్లో అక్టోబర్ నెలలో ఆమె వైద్య చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లుగా ఉందన్నారు అధికారులు. ఆ మహిళ మృతదేహాన్ని ఆసుపత్రిలో భద్రం చేశారు. స్వదేశానికి పంపేందుకు, మహిళ బంధువులు ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నారనీ, స్పాన్సరర్ కూడా ఖర్చుల్ని భరించేందుకు సిద్ధంగా లేరని వారు చెప్పారు. ఉగండా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలిపారు దుబాయ్ అధికారుఉలు. 23 ఏళ్ళ ఆ మహిళ ఒవేరియన్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు ఆమెకు గతంలో జరిగిన వైద్య పరీక్షలు, చికిత్సను బట్టి తెలియవస్తోంది. అయితే ఆ మహిళ కుటుంబ సభ్యులు గుండె సంబంధిత సమస్యతో ఆమె మృతి చెందినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







