జపాన్ లో బుల్లెట్‌ రైలెక్కిన మోదీ

- November 11, 2016 , by Maagulf
జపాన్ లో బుల్లెట్‌ రైలెక్కిన మోదీ

జపాన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలిసి బుల్లెట్‌ రైల్లో ప్రయాణించారు. జపాన్‌లోని ప్రఖ్యాత హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలు షింకన్‌సేన్‌లో టోక్యో నుంచి ఒసాకా తీరంలోని కోబ్‌ నగరం వరకు ప్రయాణించారు. అబేతో కలిసి బుల్లెట్‌ రైల్లో ప్రయాణిస్తున్న ఫొటోను మోదీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. షింకన్‌సేన్‌ బుల్లెట్‌ రైలు టెక్నాలజీతో భారత్‌లో ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు.

ఈ రైలు గంటకు 240కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇరు దేశాల ప్రధానులు రైలు ప్రయాణంలో వివిధ అంశాలపై చర్చించారు.షింకన్‌సేన్‌లో మోదీ, అబేల ప్రయాణం గురించి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వికాస్‌ స్వరూప్‌ కూడా ట్విట్టర్‌లో ఫొటోలు పోస్ట్‌ చేశారు. మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం జపాన్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జపాన్‌, భారత్‌ మధ్య చరిత్రాత్మక పౌర అణు ఒప్పందం కుదరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com