వాటర్ కెనాల్ రైడ్ తొలి అనుభవం అదుర్స్
- November 11, 2016
దుబాయ్: దుబాయ్ వాటర్ కెనాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన క్రూయిజ్ రైడ్ అద్భుతంగా ఉందంటూ తొలిసారిగా ప్రయాణించిన ప్రయాణీకులు తమ అనుభవాల్ని పంచుకుంటున్నారు. డెక్ మీదకు వెళ్ళి దుబాయ్ కెనాల్ చుట్టూ ఉన్న అందాల్ని తమ స్మార్ట్ ఫోన్లలోనూ, కెమెరాల్లోనూ బంధించారు. ఈ తొలి అనుభవం ఎంతో ప్రత్యేకమైనదిగా సౌదీ నేషనల్ మహెర్ ఖాదెర్ చెప్పారు. రైడ్లో ప్రతిక్షణాన్నీ ఎంజాయ్ చేసినట్లు మరో రైడర్ ఎర్మిన్ బోలెసిక్ చెప్పారు. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయ్ని విజిట్ చేశారు. డెన్మార్క్ నుంచి ఆయన దుబాయ్ వచ్చారు. పాలస్తీనాకి చెందిన సమెర్ రాడి మాట్లాడుతూ, పిల్లలు ఈ రైడ్ని బాగా ఎంజాయ్ చేసినట్లు వెల్లడించారు. పర్యాటకంలో ఇదొక కొత్త అనుభవం అని ఇండియాకి చెందిన సుఫియాన్ ఘన్సార్ అన్నారు. అద్భుతమైన బ్యాక్డ్రాప్తో సెల్ఫీల కోసం బోట్లో ప్రతి ఒక్కరూ పోటీ పడినట్లు ఆయన వివరించారు. తొలి రోజు తొలి రైడ్లో 37 మంది ప్రయాణీకులు ప్రయాణించి అద్భుతమైన అనుభూతికి లోనయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







