వాటర్ కెనాల్ రైడ్ తొలి అనుభవం అదుర్స్
- November 11, 2016
దుబాయ్: దుబాయ్ వాటర్ కెనాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన క్రూయిజ్ రైడ్ అద్భుతంగా ఉందంటూ తొలిసారిగా ప్రయాణించిన ప్రయాణీకులు తమ అనుభవాల్ని పంచుకుంటున్నారు. డెక్ మీదకు వెళ్ళి దుబాయ్ కెనాల్ చుట్టూ ఉన్న అందాల్ని తమ స్మార్ట్ ఫోన్లలోనూ, కెమెరాల్లోనూ బంధించారు. ఈ తొలి అనుభవం ఎంతో ప్రత్యేకమైనదిగా సౌదీ నేషనల్ మహెర్ ఖాదెర్ చెప్పారు. రైడ్లో ప్రతిక్షణాన్నీ ఎంజాయ్ చేసినట్లు మరో రైడర్ ఎర్మిన్ బోలెసిక్ చెప్పారు. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయ్ని విజిట్ చేశారు. డెన్మార్క్ నుంచి ఆయన దుబాయ్ వచ్చారు. పాలస్తీనాకి చెందిన సమెర్ రాడి మాట్లాడుతూ, పిల్లలు ఈ రైడ్ని బాగా ఎంజాయ్ చేసినట్లు వెల్లడించారు. పర్యాటకంలో ఇదొక కొత్త అనుభవం అని ఇండియాకి చెందిన సుఫియాన్ ఘన్సార్ అన్నారు. అద్భుతమైన బ్యాక్డ్రాప్తో సెల్ఫీల కోసం బోట్లో ప్రతి ఒక్కరూ పోటీ పడినట్లు ఆయన వివరించారు. తొలి రోజు తొలి రైడ్లో 37 మంది ప్రయాణీకులు ప్రయాణించి అద్భుతమైన అనుభూతికి లోనయ్యారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









