జపాన్ లో బుల్లెట్ రైలెక్కిన మోదీ
- November 11, 2016
జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి బుల్లెట్ రైల్లో ప్రయాణించారు. జపాన్లోని ప్రఖ్యాత హైస్పీడ్ బుల్లెట్ రైలు షింకన్సేన్లో టోక్యో నుంచి ఒసాకా తీరంలోని కోబ్ నగరం వరకు ప్రయాణించారు. అబేతో కలిసి బుల్లెట్ రైల్లో ప్రయాణిస్తున్న ఫొటోను మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. షింకన్సేన్ బుల్లెట్ రైలు టెక్నాలజీతో భారత్లో ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు.
ఈ రైలు గంటకు 240కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇరు దేశాల ప్రధానులు రైలు ప్రయాణంలో వివిధ అంశాలపై చర్చించారు.షింకన్సేన్లో మోదీ, అబేల ప్రయాణం గురించి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వికాస్ స్వరూప్ కూడా ట్విట్టర్లో ఫొటోలు పోస్ట్ చేశారు. మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జపాన్, భారత్ మధ్య చరిత్రాత్మక పౌర అణు ఒప్పందం కుదరింది.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









