జపాన్ లో బుల్లెట్ రైలెక్కిన మోదీ
- November 11, 2016
జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి బుల్లెట్ రైల్లో ప్రయాణించారు. జపాన్లోని ప్రఖ్యాత హైస్పీడ్ బుల్లెట్ రైలు షింకన్సేన్లో టోక్యో నుంచి ఒసాకా తీరంలోని కోబ్ నగరం వరకు ప్రయాణించారు. అబేతో కలిసి బుల్లెట్ రైల్లో ప్రయాణిస్తున్న ఫొటోను మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. షింకన్సేన్ బుల్లెట్ రైలు టెక్నాలజీతో భారత్లో ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు.
ఈ రైలు గంటకు 240కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇరు దేశాల ప్రధానులు రైలు ప్రయాణంలో వివిధ అంశాలపై చర్చించారు.షింకన్సేన్లో మోదీ, అబేల ప్రయాణం గురించి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వికాస్ స్వరూప్ కూడా ట్విట్టర్లో ఫొటోలు పోస్ట్ చేశారు. మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జపాన్, భారత్ మధ్య చరిత్రాత్మక పౌర అణు ఒప్పందం కుదరింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







