జపాన్ లో బుల్లెట్ రైలెక్కిన మోదీ
- November 11, 2016
జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి బుల్లెట్ రైల్లో ప్రయాణించారు. జపాన్లోని ప్రఖ్యాత హైస్పీడ్ బుల్లెట్ రైలు షింకన్సేన్లో టోక్యో నుంచి ఒసాకా తీరంలోని కోబ్ నగరం వరకు ప్రయాణించారు. అబేతో కలిసి బుల్లెట్ రైల్లో ప్రయాణిస్తున్న ఫొటోను మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. షింకన్సేన్ బుల్లెట్ రైలు టెక్నాలజీతో భారత్లో ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు.
ఈ రైలు గంటకు 240కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇరు దేశాల ప్రధానులు రైలు ప్రయాణంలో వివిధ అంశాలపై చర్చించారు.షింకన్సేన్లో మోదీ, అబేల ప్రయాణం గురించి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వికాస్ స్వరూప్ కూడా ట్విట్టర్లో ఫొటోలు పోస్ట్ చేశారు. మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జపాన్, భారత్ మధ్య చరిత్రాత్మక పౌర అణు ఒప్పందం కుదరింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







