శెనగలతో ఆరోగ్యం
- August 28, 2015
నానబెట్టిన గింజలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ సంగతి తెలిసిందే. అయితే వాటిలో పెసలు, మినుములు, శెనగలు ఇవి నానబెట్టిన రెండు రోజుల్లోనే మొలకలు వస్తాయి. ఈ రకంగా మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఇవి చాలా రకాల అనారోగ్యాలను దూరం చేయడంలో తోడ్పడతాయి. వాటిలో ముఖ్యంగా శెనగలు. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరానికి పీచు పదార్ధం బాగా అందుతుంది. వీటిలోని మెగ్నీషియం, ఫోలేట్ ఖనిజాలు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడ్తుంది. శెనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా రొమ్ము కాన్సర్ కారకాలను నియంత్రించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. రక్తంలోని ఎలక్ట్రోలైట్లు సమతూకంలో ఉంచేందుకు సహకరిస్తాయి. అధిక రక్త పోటు అదుపులో ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల మలబద్ధకంలాంటి సమస్యలుంటే తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. కాబట్టి మధుమేహులకు కూడా మంచి ఔషధంగా పని చేస్తాయి.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







