శెనగలతో ఆరోగ్యం
- August 28, 2015
నానబెట్టిన గింజలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ సంగతి తెలిసిందే. అయితే వాటిలో పెసలు, మినుములు, శెనగలు ఇవి నానబెట్టిన రెండు రోజుల్లోనే మొలకలు వస్తాయి. ఈ రకంగా మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఇవి చాలా రకాల అనారోగ్యాలను దూరం చేయడంలో తోడ్పడతాయి. వాటిలో ముఖ్యంగా శెనగలు. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరానికి పీచు పదార్ధం బాగా అందుతుంది. వీటిలోని మెగ్నీషియం, ఫోలేట్ ఖనిజాలు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడ్తుంది. శెనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా రొమ్ము కాన్సర్ కారకాలను నియంత్రించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. రక్తంలోని ఎలక్ట్రోలైట్లు సమతూకంలో ఉంచేందుకు సహకరిస్తాయి. అధిక రక్త పోటు అదుపులో ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల మలబద్ధకంలాంటి సమస్యలుంటే తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. కాబట్టి మధుమేహులకు కూడా మంచి ఔషధంగా పని చేస్తాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









