శెనగలతో ఆరోగ్యం
- August 28, 2015
నానబెట్టిన గింజలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ సంగతి తెలిసిందే. అయితే వాటిలో పెసలు, మినుములు, శెనగలు ఇవి నానబెట్టిన రెండు రోజుల్లోనే మొలకలు వస్తాయి. ఈ రకంగా మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఇవి చాలా రకాల అనారోగ్యాలను దూరం చేయడంలో తోడ్పడతాయి. వాటిలో ముఖ్యంగా శెనగలు. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరానికి పీచు పదార్ధం బాగా అందుతుంది. వీటిలోని మెగ్నీషియం, ఫోలేట్ ఖనిజాలు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో తోడ్పడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడ్తుంది. శెనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా రొమ్ము కాన్సర్ కారకాలను నియంత్రించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. రక్తంలోని ఎలక్ట్రోలైట్లు సమతూకంలో ఉంచేందుకు సహకరిస్తాయి. అధిక రక్త పోటు అదుపులో ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల మలబద్ధకంలాంటి సమస్యలుంటే తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. కాబట్టి మధుమేహులకు కూడా మంచి ఔషధంగా పని చేస్తాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







