ఉల్లంఘనకు పాల్పడ్డ స్కూల్కి ఫైనల్ వార్నింగ్
- November 13, 2016
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్కి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు ఎడ్యుకేషనల్ అథారిటీస్ వర్గాలు. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇది చాలా సీరియస్ వార్నింగ్గా పరిగణించాలి. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ జారీ చేసిన స్టేట్మెంట్ ప్రకారం మోడర్న్ నాలెడ్జ్ స్కూల్ (ఎంకెఎస్), నాన్ బహ్రెయినీ టీచర్లను నియమించడం ద్వారా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలియవస్తోంది. కరికులంలో లేని అకడమిక్ మెటీరియల్ని ఇక్కడ బోదించబడ్తున్నట్లుగా మినిస్ట్రీ వెల్లడించింది. ఉల్లంఘనలపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఫైనల్ వార్నింగ్ అందుకున్న స్కూల్ యాజమాన్యం. లేని పక్షంలో స్కూలు పూర్తిగా మినిస్ట్రీ పర్యవేక్షణలోకి వెళ్ళిపోతుంది. ఎక్కువ సమయం జూనియర్ స్టూడెంట్స్ని ఎండలో నిల్చోబెట్టడం, పుస్తకాల ధరల పెంపు, స్కూల్లో కెఫిటేరియా నిర్వహించకపోవడం, స్పోర్ట్స్ యూనిఫామ్పై స్కూల్ పేరెంట్స్కి సమాచారం అందివ్వకపోవడం వంటి ఉల్లంఘనలకు ఈ స్కూల్ గతంలో పాల్పడింది.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









