'డిజేబుల్డ్‌'పై జిసిసి లేబర్‌ అధికారుల చర్చ

- November 13, 2016 , by Maagulf
'డిజేబుల్డ్‌'పై జిసిసి లేబర్‌ అధికారుల చర్చ



రియాద్‌: ఆరు సభ్య దేశాలు గల గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జిసిసి) లేబర్‌ మరియు సోషల్‌ ఎఫైర్స్‌ మినిస్టర్స్‌ 33వ సెషన్‌ సన్నాహాక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై ప్రముఖులు చర్చించారు. డిజేబిలిటీస్‌తో బాధపడుతున్నవారి రక్షణ కోసం యూనిఫామ్‌ చట్టం తీసుకురావడం, గల్ఫ్‌ రీజియన్‌లో జాయింట్‌ ఛారిటీ వర్క్‌ కోసం కోఆర్డినేషన్‌ బాడీ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ అండర్‌ సెక్రెటరీస్‌, ఈ సమావేశాన్ని ప్రారంభించారు. గురువారం రియాద్‌లో మినిస్టర్స్‌ 33వ మీటింగ్‌ జరుగుతుంది. జిసిసి లేబర్‌ మరియు సోషల్‌ ఎఫైర్స్‌ మినిస్టర్స్‌ కౌన్సిల్‌ ప్రస్తుత సెషన్‌ని లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్టర్‌ ముఫ్రెజ్‌ అల్‌ హకాబాని నేతృత్వం వహిస్తున్నారు. జిసిసి సిటిజన్స్‌ సభ్య దేశాల్లో ఏ దేశంలో ఉన్నా ఒకే రకమైన సర్వీసెసస్‌ పొందే అంశమ్మీదా ఈ సెషన్‌లో చర్చ జరుగుతుంది. కామన్‌ మార్కెట్‌ గురించి కూడా చర్చిస్తారు. 2030 నాటికి సోషల్‌ డెవలప్‌మెంట్‌ మరియు సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ ఆబ్జెక్టివ్స్‌ వంటి అంశాలు ప్రధాన ఎజెండాలో ఉన్నాయి. జిసిసి సుప్రీం కౌన్సిల్‌ ఆన్‌ సోషల్‌ ఎఫైర్స్‌ గత సమావేశాలకు సంబంధించిన తీర్మానాలపైన కూడా చర్చిస్తారు. జిసిసి కంపెనీలను లేబర్‌ మినిస్టర్స్‌ సన్మానించనున్నారు. జిసిసి దేశాల్లో నేషనలైజేషన్‌ని ప్రోత్సహించిన కంపెనీలకు ఈ సన్మానం జరుగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com