'డిజేబుల్డ్'పై జిసిసి లేబర్ అధికారుల చర్చ
- November 13, 2016
రియాద్: ఆరు సభ్య దేశాలు గల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ మినిస్టర్స్ 33వ సెషన్ సన్నాహాక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై ప్రముఖులు చర్చించారు. డిజేబిలిటీస్తో బాధపడుతున్నవారి రక్షణ కోసం యూనిఫామ్ చట్టం తీసుకురావడం, గల్ఫ్ రీజియన్లో జాయింట్ ఛారిటీ వర్క్ కోసం కోఆర్డినేషన్ బాడీ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండర్ సెక్రెటరీస్, ఈ సమావేశాన్ని ప్రారంభించారు. గురువారం రియాద్లో మినిస్టర్స్ 33వ మీటింగ్ జరుగుతుంది. జిసిసి లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ మినిస్టర్స్ కౌన్సిల్ ప్రస్తుత సెషన్ని లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ ముఫ్రెజ్ అల్ హకాబాని నేతృత్వం వహిస్తున్నారు. జిసిసి సిటిజన్స్ సభ్య దేశాల్లో ఏ దేశంలో ఉన్నా ఒకే రకమైన సర్వీసెసస్ పొందే అంశమ్మీదా ఈ సెషన్లో చర్చ జరుగుతుంది. కామన్ మార్కెట్ గురించి కూడా చర్చిస్తారు. 2030 నాటికి సోషల్ డెవలప్మెంట్ మరియు సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఆబ్జెక్టివ్స్ వంటి అంశాలు ప్రధాన ఎజెండాలో ఉన్నాయి. జిసిసి సుప్రీం కౌన్సిల్ ఆన్ సోషల్ ఎఫైర్స్ గత సమావేశాలకు సంబంధించిన తీర్మానాలపైన కూడా చర్చిస్తారు. జిసిసి కంపెనీలను లేబర్ మినిస్టర్స్ సన్మానించనున్నారు. జిసిసి దేశాల్లో నేషనలైజేషన్ని ప్రోత్సహించిన కంపెనీలకు ఈ సన్మానం జరుగుతుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









