కొత్తిమీర జ్యూస్ను తీసుకుంటే..
- November 15, 2016
కొత్తిమీర జ్యూస్ను పరగడుపున తీసుకునేవారిలో బీపీ కంట్రోల్లో ఉంటుందట. అంతేకాకుండా కంటిచూపు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొత్తిమీర జ్యూస్ ఎలా చేయాలంటే..? ఒక కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి. రెండు టీ స్పూన్ల నిమ్మరసం, అర టీ స్పూన్ ఉప్పు, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అన్నింటినీ మిక్సర్లో మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని వడపోయకుండా అలానే తాగాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ జ్యూస్ తీసుకున్న అరగంట వరకు ఏ ఆహారం తీసుకోకూడదు. దీనివల్ల షుగర్, కొలెస్ట్రాల్, బీపీ కంట్రోల్లో ఉంటాయి.
అంతేగాకుండా కొత్తిమీర చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని మలినాలను టాక్సిన్ల రూపంలో వెలివేస్తుంది. క్యాన్సర్ సెల్స్ మీద పోరాడుతుంది. స్త్రీలలో రుతు సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







