కొత్తిమీర జ్యూస్ను తీసుకుంటే..
- November 15, 2016
కొత్తిమీర జ్యూస్ను పరగడుపున తీసుకునేవారిలో బీపీ కంట్రోల్లో ఉంటుందట. అంతేకాకుండా కంటిచూపు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొత్తిమీర జ్యూస్ ఎలా చేయాలంటే..? ఒక కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి. రెండు టీ స్పూన్ల నిమ్మరసం, అర టీ స్పూన్ ఉప్పు, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అన్నింటినీ మిక్సర్లో మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని వడపోయకుండా అలానే తాగాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ జ్యూస్ తీసుకున్న అరగంట వరకు ఏ ఆహారం తీసుకోకూడదు. దీనివల్ల షుగర్, కొలెస్ట్రాల్, బీపీ కంట్రోల్లో ఉంటాయి.
అంతేగాకుండా కొత్తిమీర చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని మలినాలను టాక్సిన్ల రూపంలో వెలివేస్తుంది. క్యాన్సర్ సెల్స్ మీద పోరాడుతుంది. స్త్రీలలో రుతు సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









