జాయింట్ ఇన్స్పెక్షన్స్కి ఖతార్ ఓకే
- November 15, 2016
ఖతార్ వరల్డ్ కప్ 2022 నిర్వాహకులు, ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ ఇన్స్పెక్షన్స్కు అనుమతి లభించినట్లు తెలిపారు. ఖతార్ సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ, గ్లోబల్ బిల్డింగ్ అండ్ ఉడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఐ) గ్రూప్ జాయింట్ ఇన్స్పెక్షన్కి అనుమతి తెలిపింది. స్టేడియంల నిర్మాణం, అలాగే అకామడేషన్కి సంబంధించి ఈ తనిఖీలు ఉంటాయి. కార్మికుల భద్రతకు సంబంధించి ఇదొక కీలక పరిణామం అని కమిటీ హెడ్ హసన్ అల్ తవ్వాది చెప్పారు. ఖతార్ కమిట్మెంట్కి ఇది నిదర్శనం అని ఆయన అన్నారు. జనవరి 2017లో ఈ తనిఖీలు ప్రారంభమవుతాయి. బిడబ్లుఐలో మొత్తం 13 మంది ప్రతినిథులు ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా 300 ట్రేడ్ యూనియన్స్కి వీరు ప్రాతినిథ్యం వహిస్తారు. బిడబ్ల్యుఐ జనరల్ సెక్రెటరీ అంబెట్ యూసున్ మాట్లాడుతూ, 2022 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించి కార్మికుల భద్రతకు ఇది అత్యంత కీలకమైన విషయమని అన్నారు. తనిఖీల అనంతరం ఇచ్చే రిపోర్ట్ ఇండిపెండెంట్గా ఉంటుందని, పబ్లిక్ కోసం విడుదల చేయబడ్తుందని బిడబ్ల్యుఐ వెల్లడించింది. వరల్డ్ కప్ ప్రాజెక్టు కోసం 10,000 నుంచి 30,000 మంది కార్మికులు పనిచేయనున్నారు. కార్మికుల కోసం ఖతార్ ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. గత ఏడాది వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ని తీసుకొచ్చింది. లేబర్ సమస్యల కోసం న్యాయమూర్తి నేతృత్వంలోని ఓ ప్యానెల్ని కూడా ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!









