జాయింట్ ఇన్స్పెక్షన్స్కి ఖతార్ ఓకే
- November 15, 2016
ఖతార్ వరల్డ్ కప్ 2022 నిర్వాహకులు, ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ ఇన్స్పెక్షన్స్కు అనుమతి లభించినట్లు తెలిపారు. ఖతార్ సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ, గ్లోబల్ బిల్డింగ్ అండ్ ఉడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఐ) గ్రూప్ జాయింట్ ఇన్స్పెక్షన్కి అనుమతి తెలిపింది. స్టేడియంల నిర్మాణం, అలాగే అకామడేషన్కి సంబంధించి ఈ తనిఖీలు ఉంటాయి. కార్మికుల భద్రతకు సంబంధించి ఇదొక కీలక పరిణామం అని కమిటీ హెడ్ హసన్ అల్ తవ్వాది చెప్పారు. ఖతార్ కమిట్మెంట్కి ఇది నిదర్శనం అని ఆయన అన్నారు. జనవరి 2017లో ఈ తనిఖీలు ప్రారంభమవుతాయి. బిడబ్లుఐలో మొత్తం 13 మంది ప్రతినిథులు ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా 300 ట్రేడ్ యూనియన్స్కి వీరు ప్రాతినిథ్యం వహిస్తారు. బిడబ్ల్యుఐ జనరల్ సెక్రెటరీ అంబెట్ యూసున్ మాట్లాడుతూ, 2022 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించి కార్మికుల భద్రతకు ఇది అత్యంత కీలకమైన విషయమని అన్నారు. తనిఖీల అనంతరం ఇచ్చే రిపోర్ట్ ఇండిపెండెంట్గా ఉంటుందని, పబ్లిక్ కోసం విడుదల చేయబడ్తుందని బిడబ్ల్యుఐ వెల్లడించింది. వరల్డ్ కప్ ప్రాజెక్టు కోసం 10,000 నుంచి 30,000 మంది కార్మికులు పనిచేయనున్నారు. కార్మికుల కోసం ఖతార్ ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. గత ఏడాది వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ని తీసుకొచ్చింది. లేబర్ సమస్యల కోసం న్యాయమూర్తి నేతృత్వంలోని ఓ ప్యానెల్ని కూడా ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







