శబరిమలలో తెరుచుకున్న అయ్యప్ప ఆలయం
- November 15, 2016
శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయాన్ని మంగళవారం తెరిచారు. ఈ ఏడాది అయ్యప్ప సీజన్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. 41 రోజులపాటు నిర్వహించే మండలం పండుగ గురు వారం నుంచి మొదలవుతోంది. తొలి రోజునే స్వామి దర్శనం చేసుకునేందుకు అప్పుడే పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల చేరుకున్నారు. కొద్ది రోజుల్లో భారీసంఖ్యలో భక్తులు చేరుకునే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేశారు. నిరుడు 4.5 కోట్లమందికిపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ప్రధానార్చకుడు కందరారు రాజీవరారు వెంటరాగా, త్వరలో బాధ్యతల నుంచి వైదొలుగుతున్న ప్రధానార్చకుడు ఎస్ఈ శంకరన్ నంబూద్రి మంగళవారం సాయంత్రం గర్భాలయాన్ని తెరవడంతో కార్యకలాపాలు సంప్రదాయసిద్ధంగా ప్రారంభమయ్యాయి.
ప్రధానార్చకుడు బుధవారం ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం నిర్వహిస్తారు. తెల్లవారుజామున మూడున్నరకు అష్టాభిషేకం చేసిన తర్వాత.. నేతితో అభిషేకం చేస్తారు. మండలపూజ తర్వాత డిసెంబరు 26న మండలం పండుగ ముగుస్తుంది.
ఆదే రోజు సాయంత్రం గుడిని మూసివేస్తారు. 'మకరవిలక్కు' పండుగ కోసం ఆలయాన్ని మళ్లీ డిసెంబరు 30న తెరుస్తారు. జనవరి 14న భక్తులు మకరజ్యోతిని దర్శించుకుంటారు. జనవరి 20న గుడిని మూసివేస్తారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







