నిర్మాతగా ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్న చెర్రీ ...
- November 17, 2016
మెగాస్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో రామ్ చరణ్. ఇప్పటికే హీరోగా సత్తా చాటిన చెర్రీ ప్రస్తుతం నిర్మాతగానూ ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. తొలిసారిగా నిర్మాతగా మారడానికి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమానే కరెక్ట్ అని భావించాడు. అందుకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150ని తను సొంతంగా స్థాపించిన కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి నిర్మిస్తున్నాడు.తండ్రి సినిమాతో నిర్మాతగా మారిన చెర్రీ, ఫ్యూచర్ లోనూ తన బ్యానర్ క్రేజీ ప్రాజెక్ట్స్ ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఓ క్లారిటీకి వచ్చాడన్న టాక్ వినిపిస్తోంది.చిరు సినిమా పూర్తవ్వగానే తన చిన్ననాటి మిత్రుడు శర్వానంద్ హీరోగా ఒక సినిమా, అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా మరో సినిమాను ప్రారంభించే ప్లాన్ ఉన్నాడట. మెగాస్టార్ వారసుడిగా నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగానూ ప్రూవ్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడు చరణ్.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









