నిర్మాతగా ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్న చెర్రీ ...
- November 17, 2016
మెగాస్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో రామ్ చరణ్. ఇప్పటికే హీరోగా సత్తా చాటిన చెర్రీ ప్రస్తుతం నిర్మాతగానూ ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. తొలిసారిగా నిర్మాతగా మారడానికి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమానే కరెక్ట్ అని భావించాడు. అందుకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150ని తను సొంతంగా స్థాపించిన కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి నిర్మిస్తున్నాడు.తండ్రి సినిమాతో నిర్మాతగా మారిన చెర్రీ, ఫ్యూచర్ లోనూ తన బ్యానర్ క్రేజీ ప్రాజెక్ట్స్ ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఓ క్లారిటీకి వచ్చాడన్న టాక్ వినిపిస్తోంది.చిరు సినిమా పూర్తవ్వగానే తన చిన్ననాటి మిత్రుడు శర్వానంద్ హీరోగా ఒక సినిమా, అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా మరో సినిమాను ప్రారంభించే ప్లాన్ ఉన్నాడట. మెగాస్టార్ వారసుడిగా నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగానూ ప్రూవ్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడు చరణ్.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







