వలసదారులపై పన్ను పెంపు

- November 17, 2016 , by Maagulf
వలసదారులపై పన్ను పెంపు

ప్రభుత్వం వలసదారులకు సంబంధించిన రెమిటెన్సెస్‌ మరియు కంపెనీలపై 2 నుంచి 5 శాతం వరకు పన్ను పెంచే ఆలోచన చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. హెల్త్‌కేర్‌ మరియు ఎడ్యుకేషన్‌ రంగాల ప్రైవేటైజేషన్‌ కోసం కూడా సమాలోచనలు జరుగుతున్నాయి. 100 కువైట్‌ దినార్స్‌లోపు 2 శాతం ట్యాక్స్‌ని, 100 నుంచి 500 కువైట్‌ దినార్స్‌ వరకు 4 శాతం, 500 కువైట్‌ దినార్స్‌ దాటితే 5 వాతం పన్ను విధించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇలా వసూలు చేసిన మొత్తం స్టేట్‌ ట్రెజరీకి సరాసరి వెళుతుంది. స్వదేశానికి వలసదారులెవరైనా అక్రమ మార్గాల్లో డబ్బుని పంపించదలచుకుంటే అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. 6 నెలలు అంతకు మించిన జైలు శిక్షతోపాటు 10,000 కువైట్‌ దినార్స్‌ జరీమానా కూడా పడుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com