ట్రాఫిక్ అవేర్నెస్లో ఇన్సూరెన్స్ కంపెనీల వైఫల్యం
- November 19, 2016
ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్, డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ సాద్ అల్ ఖర్జి, ట్రాఫిక్ అవేర్నెస్ పెంచడంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమాత్రం శ్రద్ధ పెట్టడంలేదని ఆక్షేపించారు. ఈ విభాగంలో ఇన్సూరెన్స్ కంపెనీల పాత్ర కీలకం అయినా, వారు చూపుతున్న శ్రద్ధ చాలా చాలా తక్కువగా ఉందని అన్నారాయన. ఇన్సూరెన్స్ కంపెనీలు, పలు రకాలైన ఆలోచనలతో ట్రాఫిక్ అవేర్నెస్ని పెంచే చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రమాదాల్ని తగ్గించేందుకు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్న చర్యల్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ప్రచారం చేయాల్సి ఉందని చెప్పారు. రోడ్లపై భద్రత విషయంలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు సంయుక్తంగా కలసి పనిచేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో డాక్యుమెంటేషన్స్, క్లియరెన్స్లు త్వరితగతిన చేయవలసి ఉంటుందన్న ఆయన ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అయినప్పటికీ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తగిన స్థాయిలో మద్దతు రావడంలేదని అన్నారాయన. వాహనదారుల కోసం ఖతార్ ఇస్లామిక్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఖతార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, జనరల్ తకాఫుల్ కంపెనీ, ఖతార్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయాల్ని డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఏర్పాటు చేసిందని తెలియజేశారు అల్ ఖర్జి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







