ఇండోనేసియాలో పడవను ఢీకొన్న నౌక 15 మంది గల్లంతు

- November 19, 2016 , by Maagulf
ఇండోనేసియాలో పడవను ఢీకొన్న నౌక 15 మంది గల్లంతు

ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రావిన్స్ లో పడవను నౌక ఢీకొట్టిన ఘటనలో కనీసం 15 మంది గల్లంతయ్యారు. శనివారం తుర్బాన్ జిల్లా జలాల్లో వియత్నాం నౌక, ఇండోనేసియా పడవ ఢీకొన్నాయి. ఇండోనేసియా పడవలో 27 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో గల్లంతయిన వారందరూ పడవలో ప్రయాణిస్తున్న వారేనని అధికారులు చెప్పారు. పడవలో ఉన్నవారిలో 12 మందిని సురక్షితంగా కాపాడమని తెలిపారు. మిగిలివారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తూర్పు జావా ప్రావిన్స్ రాజధాని సురబయలోని ఓడరేవుకు వియత్నాం నౌక వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com