మోదీతో కెసిఆర్ భేటీ

- November 19, 2016 , by Maagulf
మోదీతో కెసిఆర్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఢిల్లీవెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ భేటీలో పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులను మోదీకి సీఎం వివరించినట్టు తెలుస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ర్టానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందిగా కూడా కెసిఆర్ ప్రధానిని కోరినట్లు సమాచారం.
కేంద్రానికి చెల్లించాల్సిన పన్నుల్లో మారటోరియం విధించి వెసులుబాటు కల్పించాలని.. గృహిణులు దాచుకున్న మొత్తాన్ని నల్లధనంగా పరిగణించవద్దని కూడా సిఎం సూచించనట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రూ. 500 నోట్లు అందుబాటులోకి తీసుకురావాలని.. గ్రామాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా పెద్ద నోట్ల మార్పిడి కొనసాగించాలని, ప్రైవేటు హాస్పిటల్స్ లోనూ పాతనోట్లు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని మోదీకి కెసిఆర్ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com