చైనా ఓపెన్ లో ఫైనల్‌కు చేరిన సింధు

- November 19, 2016 , by Maagulf
చైనా ఓపెన్ లో  ఫైనల్‌కు చేరిన సింధు

చైనా సూపర్‌ సిరీస్‌ ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దూసుకుపోతుంది. కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు కేవలం అడుగుదూరంలో నిలిచింది. చైనా ఓపెన్ సిరిస్‌లో పీవీ సింధు ఫైనల్స్‌కు చేరుకుంది.
సెమీఫైనల్స్‌లో భాగంగా శనివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఏడో సీడ్‌ సింధు 11-21, 23-21, 21-19 స్కోరుతో దక్షిణ కొరియా క్రీడాకారిణి ఆరో సీడ్‌ సుంగ్ జి హ్యున్‌పై విజయం సాధించింది. సెమీస్‌లో సింధుకు గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు వెంటనే పుంజుకుని సత్తాచాటింది.
ఆ తర్వాత సాగిన రెండు గేమ్‌ల్లో సింధు సుంగ్ జి హ్యున్‌పై గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది.

ఆదివారం జరిగే ఫైనల్స్‌లో సున్‌ యుతో తలపడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com