మంచినీటితో తలనొప్పికి చెక్
- November 19, 2016
తలనొప్పికి చెక్ పెట్టాలంటే.. నీరెక్కువ తాగండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. స్త్రీలు పనుల్లో పడిపోయి దీని గురించి అంతగా పట్టించుకోరు. ఒంట్లో ఏమాత్రం నీటి శాతం తగ్గినా (డీహైడ్రేషన్) మూడ్ మారిపోవటానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తేలికపాటి వ్యాయామాలు చేసినా, కంప్యూటర్ ముందు పనిచేస్తున్నా సరే.. మహిళలు ఎక్కువగా అలసటకు గురవుతుంటారని.. అలాంటి వారు నీరు ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఒంట్లో నీరు తగ్గినపుడు వీరిలో మానసిక సామర్థ్యంలో ఎలాంటి తేడా కనిపించలేదు గానీ ఏకాగ్రత మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. లక్ష్యాలను గుర్తించే పరీక్షలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడ్ మారిపోయి ఉత్సాహం తగ్గిపోవటం, అలసట పెరిగిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు నిజానికి మనకు దాహం వేసే సమయానికే ఒంట్లో నీటిశాతం తగ్గిపోయి ఉంటుందని గుర్తించాలి.
తలనొప్పి, అలసట ఉన్నాయంటే మరింత ఎక్కవ నీళ్లు తాగాలి. కాబట్టి నిరంతరం పనుల్లో మునిగిపోయే స్త్రీలు, వ్యాయామాలు చేసే మహిళలు తరచుగా నీళ్లు తాగటం మేలు. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







