ప్రభాస్ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్న నీల్ నితిన్ ముఖేష్
- November 20, 2016
'బాహుబలి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ చిత్రం తరువాత ఆయన సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నాడు. దాదాపు రూ.150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది ఈ చిత్రం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నాడట.
కవలలైన ఇద్దరిలో ఒకరు హీరోకి స్నేహితుడిగా మరొకరు విలన్ గా కనిపించనున్నారట. ఈ రెండు పాత్రలు ఒకేలా ఉండడంతో పలు సందర్భాలలో హీరో కన్ఫ్యూజ్ అవుతాడట. ఈ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తాయని అంటున్నారు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుంది.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







