ప్రభాస్ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్న నీల్ నితిన్ ముఖేష్

- November 20, 2016 , by Maagulf
ప్రభాస్ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్న నీల్ నితిన్ ముఖేష్

'బాహుబలి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ చిత్రం తరువాత ఆయన సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నాడు. దాదాపు రూ.150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది ఈ చిత్రం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నాడట.

కవలలైన ఇద్దరిలో ఒకరు హీరోకి స్నేహితుడిగా మరొకరు విలన్ గా కనిపించనున్నారట. ఈ రెండు పాత్రలు ఒకేలా ఉండడంతో పలు సందర్భాలలో హీరో కన్ఫ్యూజ్ అవుతాడట. ఈ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తాయని అంటున్నారు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com