ఎస్పీ బాలుకు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్‌' అవార్డు

- November 20, 2016 , by Maagulf
ఎస్పీ బాలుకు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్‌' అవార్డు

గోవా రాజధాని పానాజీలో 47వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య నాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి 2016 సంవత్సరానికి గానూ సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్‌ను బహుకరించారు. గోవా సిఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ శాలువా కప్పగా, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు జ్ఞాపికను అందజేశారు. సినీ రంగంలో తన ప్రస్థానం ఫలప్రదంగా సాగిందన్న బాలు ఈ అవార్డును తన తల్లికి అంకితమిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28వరకూ సాగే ఈ చిత్రోత్సవంలో 90దేశాలకు చెందిన 300 చిత్రాలను ప్రదర్శిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com