ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్
- November 22, 2016
ప్రముఖ స్వదేశీ విమానయాన సంస్థ ఇండిగో.. స్పైస్జెట్ బాటలోనే పయనించింది. ప్రయాణికులకు తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందించేందుకు సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. రూ.737 ప్రారంభ ధరకే టికెట్ విక్రయాలను జరుపుతోంది. ఈ నెల 24వరకు ఈ ఆఫర్ మీద టికెట్ విక్రయాలు జరుగుతాయని ఇండిగో ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. జనవరి 9, 2017 నుంచి అక్టోబర్ 28, 2017 మధ్య ఇప్పుడు తీసుకునే టికెట్లతో ప్రయాణాలు చేయవచ్చు. ఇండిగో వెబ్సైట్లో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరిచామని, చెన్నై- కోయంబత్తూరు మార్గంలో ఈ ఆఫర్ వర్తిస్తుంది. వీటితో పాటు ఎయిర్ఏషియా అన్ని ఛార్జీలతో కలిసి రూ.899కే టికెట్ను విక్రయిస్తున్న ఆఫర్ ఈ నెల 27 వరకు ఉంది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









