ఫిలిప్పీన్స్‌లో భారత జంట కాల్చివేసిన దుండగులు

- November 24, 2016 , by Maagulf
ఫిలిప్పీన్స్‌లో భారత జంట కాల్చివేసిన దుండగులు

భారత్‌కు చెందిన ఓ సిక్కుజంట ఫిలిప్పీన్స్‌లో కాల్చివేతకు గురైంది. కేమరిన్స్ సర్ ప్రావిన్స్‌లోని సిపోకోట్ పట్టణానికి చెందిన భగవంత్ సింగ్ బుట్టర్(45), అతడి భార్య జస్విందర్ కౌర్(36)ను రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు ఈరోజు కాల్చి చంపారు. ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న మార్విన్ మగ్డావోంగ్ రోడొల్ఫోలను పోలీసులు అరెస్ట్ చేశారు. దంపతులను ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. రెండు పిస్టళ్లు, మందుగుండును నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఫిలిప్పీన్స్‌లో గతంలోనూ పలువురు భారతీయులపై దాడులు జరిగాయి. చివరిగా ఈ ఏడాది ఆగస్టులో పంజాబ్‌లోని ఫగ్వారాకు చెందిన 26 ఏళ్ల యువకుడిని శాంటియాగోలో దుండగులు కాల్చి చంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com