రాత్రిపూట భోజనం చేయగానే నిద్రపోకూడదు
- November 24, 2016
రాత్రిపూట కడుపు నిండా భోజనం చేసేసి చాలామంది వెంటనే గుర్రుపెట్టి నిద్ర లాగించేస్తారు. కానీ అలా చేయకూడదు. భోజనం చేసిన తర్వాత నిదానంగా కనీసం వంద అడుగులైనా నడవాలి. దీనివల్ల త్వరగా భుజించిన ఆహారం చక్కగా జీర్ణమయ్యేందుకు వీలు కలుగుతుంది. మెడ, మోకాళ్లు, నడుము మొదలగు అవయవాలకు పని దొరుకుతుంది.
భోజనం చేసిన తర్వాత భుక్తాయాసంతో కూర్చున్నవారికి బానపొట్ట పెరుగుతుంది. నడుము వాల్చి పడుకునేవారికి మంచి బలము కలుగుతుంది. భోజనానంతరం పరుగెత్తడం, వ్యాయామం చేయడం చెడు ఫలితాలనిస్తాయి.
రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎనిమిది ఉశ్వాస, నిశ్వాసములు కలిగే వరకూ వెల్లకిలా పడుకోవాలి. తర్వాత 16 ఉశ్వాస, నిశ్వాసాలు వచ్చేవరకూ కుడిప్రక్కకు తిరిగి పడుకోవాలి. ఆ తర్వాత 32 ఉశ్వాస, నిశ్వాసాలు కలిగే వరకూ ఎడమవైపుకి తిరిగి పడుకోవాలి. ఆ తర్వాత ఎలా నిద్రపడితే అలా పడుకోవచ్చు. నాభిపైన ఎడమవైపు జఠరాగ్ని ఉంటుంది కనుక తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవడం జరుగుతుంది.
నిద్రపోయేందుకు అనుకూలమైన స్థలమును ఎన్నుకోవాలి. మంచి గాలి వచ్చేట్లు ఉండాలి. గాలి బావుండట వలన తాపము, పిత్తము, చెమట, మూర్చ, దప్పిక మొదలగు వాటిని పోగొడుతుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







