ఇరాక్ లో ఆత్మహుతి దాడి 70 మంది భక్తులు మృతి

- November 24, 2016 , by Maagulf
ఇరాక్ లో ఆత్మహుతి దాడి 70 మంది భక్తులు మృతి

బాంబు పేలుడుతో ఇరాక్ మరోమారు దద్దరిల్లింది. ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడు ట్రక్కు బాంబుతో విరుచుకుపడ్డాడు. ఈ  దాడితో ఇరాక్ రక్తసిక్తమైంది. ఈ ఘటనలో 70 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతి చెందిన వారందరూ షియా భక్తులే. పవిత్ర షియా నగరం కర్బాలా నుంచి వస్తుండగా ఉగ్రవాది ట్రక్కు బాంబుతో విరుచుకుపడ్డాడు. దాడిలో కనీసం 70 మంది మృతి చెంది ఉండొచ్చని భద్రతాధికారి ఒకరు తెలిపారు. మృతి చెందిన వారిలో పది మంది ఇరాకీలు కాగా మిగిలినవారు ఇరానియన్లని పేర్కొన్నారు. ఈ పేలుడుపై ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com