ఆరుగురు తీవ్రవాద అనుమానితులకు జీవిత ఖైదు
- November 24, 2016
మనామా: హై క్రిమినల్ కోర్ట్, ఆరుగురు తీవ్రవాద అనుమానితులకు జీవిత ఖైదు విధించింది. పేలుడు పదార్థాలను కలిగి ఉన్నారనీ, వాటిని వినియోగించారనే అభియోగాలు వారిపై మోపబడ్డాయి. మమీర్లో ఓ పోలీస్ అధికారిని చంపేందుకు కూడా ఈ వ్యక్తులు కుట్ర పన్నిన కేసులో దోషులుగా తేలారని చీఫ్ ప్రాజిక్యూటర్ హమాద్ షహీన్ చెప్పారు. 2015 మే 30న మమీర్ విలేజ్లో బాంబుల్ని పెట్టి ఓ పోలీస్ అధికారిని చంపడానికి ప్లాన్ చేశారు. అనుమానాస్పదంగా అక్కడే నక్కి ఉన్నవారిని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత బాంబుని కనుగొని నిర్వీర్యం చేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. బాంబు ఒకవేళ పేలి ఉంటే తీవ్రమైన నష్టం వాటిల్లేది. అన్ని వాదనల్నీ విన్న న్యాయస్థానం, సాక్ష్యాధారాల్ని పరిశీలించి, నిందితులకు జీవిత ఖైదును విధించింది. నిందితుల తరఫున కూడా వాదనలకు ఆస్కారం కలిగిందిగానీ, నేర నిరూపణ అవడంతో నిందితులకు శిక్ష తప్పలేదు.
తాజా వార్తలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు









