టెర్రాస్పై జీవనం గడుపుతున్న వ్యక్తికి ఊరట
- November 24, 2016
సంజీవ్ రాజన్ అనే భారతీయ ఎలక్ట్రీషియన్, ఎనిమిది నెలలకు పైగా టెర్రాస్పైనే జీవనం సాగిస్తున్నాడు. అతని ఆవేదనా భరితమైన జీవితం గురించి తెలుసుకున్న ఓ ఫిలాంత్రపిస్ట్, బాధితుడికి తక్షణ సాయం కింద 5,000 దిర్హామ్లు అందజేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 1 మిలియన్ (సుమారు 55,000 దిర్హామ్లు) బాధితుడి బ్యాంకు ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయనున్నట్లు వెల్లడించారాయన. బాధితుడి పేరు సంజీవ్ రాజన్ కాగా, ఆయన్ని ఆదుకునేందుకు ముదుకొచ్చిన వ్యక్తి పేరు రబీహ్ రబీముల్లా. హెల్త్కేర్ గ్రూప్ అయిన షిఫా అల్ జజీరా మెడికల్ గ్రూప్ చైన్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని, బాధితుడ్ని ఆదుకుంటున్నారు. ఒమన్ నుంచి సరాసరి తన వద్దకే వచ్చి ఈ సాయం అందించడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నట్లు సంజీవ్ చెప్పాడు. ఎనిమిది నెలలుగా ఒక్క రూపాయి కూడా తనకు జీతం రాకపోవడంతో దుర్భర జీవితంగ డిపానని అన్నాడు సంజీవ్. ఇంకో వైపున ఇండియన్ కాన్సులేట్ కూడా సంజీవ్కి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. సంజీవ్ పనిచేస్తున్న కంపెనీ రిటర్న్ పాస్పోర్ట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయగా, అప్పటివరకూ అతని సంరక్షణ చూసుకునేందుకు అంగీకరించింది కాన్సులేట్.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







