టెర్రాస్పై జీవనం గడుపుతున్న వ్యక్తికి ఊరట
- November 24, 2016
సంజీవ్ రాజన్ అనే భారతీయ ఎలక్ట్రీషియన్, ఎనిమిది నెలలకు పైగా టెర్రాస్పైనే జీవనం సాగిస్తున్నాడు. అతని ఆవేదనా భరితమైన జీవితం గురించి తెలుసుకున్న ఓ ఫిలాంత్రపిస్ట్, బాధితుడికి తక్షణ సాయం కింద 5,000 దిర్హామ్లు అందజేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 1 మిలియన్ (సుమారు 55,000 దిర్హామ్లు) బాధితుడి బ్యాంకు ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయనున్నట్లు వెల్లడించారాయన. బాధితుడి పేరు సంజీవ్ రాజన్ కాగా, ఆయన్ని ఆదుకునేందుకు ముదుకొచ్చిన వ్యక్తి పేరు రబీహ్ రబీముల్లా. హెల్త్కేర్ గ్రూప్ అయిన షిఫా అల్ జజీరా మెడికల్ గ్రూప్ చైన్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని, బాధితుడ్ని ఆదుకుంటున్నారు. ఒమన్ నుంచి సరాసరి తన వద్దకే వచ్చి ఈ సాయం అందించడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నట్లు సంజీవ్ చెప్పాడు. ఎనిమిది నెలలుగా ఒక్క రూపాయి కూడా తనకు జీతం రాకపోవడంతో దుర్భర జీవితంగ డిపానని అన్నాడు సంజీవ్. ఇంకో వైపున ఇండియన్ కాన్సులేట్ కూడా సంజీవ్కి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. సంజీవ్ పనిచేస్తున్న కంపెనీ రిటర్న్ పాస్పోర్ట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయగా, అప్పటివరకూ అతని సంరక్షణ చూసుకునేందుకు అంగీకరించింది కాన్సులేట్.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







