టెర్రాస్పై జీవనం గడుపుతున్న వ్యక్తికి ఊరట
- November 24, 2016సంజీవ్ రాజన్ అనే భారతీయ ఎలక్ట్రీషియన్, ఎనిమిది నెలలకు పైగా టెర్రాస్పైనే జీవనం సాగిస్తున్నాడు. అతని ఆవేదనా భరితమైన జీవితం గురించి తెలుసుకున్న ఓ ఫిలాంత్రపిస్ట్, బాధితుడికి తక్షణ సాయం కింద 5,000 దిర్హామ్లు అందజేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 1 మిలియన్ (సుమారు 55,000 దిర్హామ్లు) బాధితుడి బ్యాంకు ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయనున్నట్లు వెల్లడించారాయన. బాధితుడి పేరు సంజీవ్ రాజన్ కాగా, ఆయన్ని ఆదుకునేందుకు ముదుకొచ్చిన వ్యక్తి పేరు రబీహ్ రబీముల్లా. హెల్త్కేర్ గ్రూప్ అయిన షిఫా అల్ జజీరా మెడికల్ గ్రూప్ చైన్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని, బాధితుడ్ని ఆదుకుంటున్నారు. ఒమన్ నుంచి సరాసరి తన వద్దకే వచ్చి ఈ సాయం అందించడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నట్లు సంజీవ్ చెప్పాడు. ఎనిమిది నెలలుగా ఒక్క రూపాయి కూడా తనకు జీతం రాకపోవడంతో దుర్భర జీవితంగ డిపానని అన్నాడు సంజీవ్. ఇంకో వైపున ఇండియన్ కాన్సులేట్ కూడా సంజీవ్కి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. సంజీవ్ పనిచేస్తున్న కంపెనీ రిటర్న్ పాస్పోర్ట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయగా, అప్పటివరకూ అతని సంరక్షణ చూసుకునేందుకు అంగీకరించింది కాన్సులేట్.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు