45వ జాతీయ దినోత్సవం ఎతిహాద్ 45 శాతం డిస్కౌంట్
- December 01, 2016
ఎతిహాద్ ఎయిర్వేస్ తమ ప్రయాణీకులకు 45 శాతం డిస్కౌంట్ ఫేర్స్ని యూఏఈ నేషనల్ డే సందర్భంగా ప్రకటించింది. 45 డెస్టినేషన్లకు సంబంధించి ఎకానమీ, బిజినెస్ క్లాస్ ప్రయాణీకులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రయాణీకులు డిసెంబర్ 2 లోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 15 వరకు ప్రయాణాలు చేసేందుకు వీలుంది. డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది ఆయా డెస్టినేషన్లకు భిన్నంగా ఉండొచ్చు. మేగ్జిమమ్ డిస్కౌంట్ 45 శాతం అని ఎతిహాద్ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎతిహాద్ వెబ్సైట్లో చూడొచ్చు. ఇండియన్ సబ్ కాంటినెంట్లోని డెస్టినేషన్లకు ఎకానమీ క్లాస్ రిటర్న్ ఫేర్స్ అతి తక్కువగా 660 దిర్హామ్లు ముంబైకి, బెంగళూరుకి 809, ఢిల్లీకి 739 దిర్హామ్లుగా నిర్ణయించారు. ఎమిరేట్స్ కూడా స్పెషల్ ఫేర్స్ని ఇప్పటికే ప్రకటించింది డిసెంబర్ 8 లోపు బుక్ చేసుకున్న వారు డిసెంబర్ 1 నుంచి జూన్ 15 వరకు డిస్కౌంట్ ఫేర్తో ప్రయాణించేందుకు వీలుంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







