అమ్నెస్టీ ముగింపుతో అక్రమ నివాసితులపై చర్యలు
- December 02, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - సెర్చ్ అండ్ ఫాలో అప్ డిపార్ట్మెంట్, అక్రమంగా ఖతార్లో నివసిస్తున్నవారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మూడు నెలల అమ్నెస్టీ నేటితో ముగియడంతో త్వరలో దేశవ్యాప్తంగా తనిఖీల్ని నిర్వహిస్తారు. అమ్నెస్టీ గడువు పెంచే అవకాశం లేదని అధికారిక వర్గాల నుంచి సమాచారం అందుతోంది. త్వరలో ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లు ప్రారంభమవుతాయి. అరబిక్, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, నేపాలీస్, ఇండోనేసియన్, తగలాగ్, ఉర్దు, సింహలీస్, తమిళ, మలయాళ భాషల్లో అమ్నెస్టీపై పెద్దయెత్తున ప్రచారం నిర్వహించింది ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్. ఎంబసీలు కూడా అమ్నెస్టీపై తమ పౌరుల్ని అప్రమత్తం చేశాయి. చాలావరకు అమ్నెస్టీని వినియోగించుకోగా, అమ్నెస్టీని లెక్కచేయనివారు ఇకపై ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









