పఠాన్‌ కోట్‌ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి

- December 02, 2016 , by Maagulf
పఠాన్‌ కోట్‌ లో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితి

పంజాబ్‌ లోని పఠాన్‌ కోట్‌ లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పాకిస్థాన్‌ గడ్డపై నుంచి ఉగ్రవాదులు పంజాబ్‌ లోని పఠాన్‌ కోట్‌ లోకి చొరబడేందుకు కుట్రపన్నారు. బీఎస్ఎఫ్‌ జవాన్లు వెంటనే అప్రమత్తంకావడంతో ముప్పు తప్పింది. భారత జవాన్ల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరికొందరు ఉగ్రవాదులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పఠాన్‌ కోట్‌ లో భారత భద్రత దళాలు గస్తీ పెంచాయి. రోడ్లు, కీలక ప‍్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు.

జనవరిలో పఠాన్‌కోట్ భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టగా, ఏడుగురు భద్రత సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com