మైనర్ పిల్లలు తన దగ్గరే ఉంచాలని రంభ కోర్ట్ లో దాఖలాలు..

- December 04, 2016 , by Maagulf
మైనర్ పిల్లలు తన దగ్గరే ఉంచాలని రంభ కోర్ట్ లో దాఖలాలు..

కొన్ని రోజులుగా నటి రంభ విడాకుల వ్యవహారం మీడియా లో తెగ ప్రచారం జరుగుతున్న సంగతి తెల్సిందే..ఆ మధ్య విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన రంభ.తాజాగా తన పిల్లలు నాకు ఇప్పించాలని శనివారం ముంబై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
2010 లో కెనడాకు చెందిన ఇంద్రన్ పద్మనాభన్ అనే వ్యాపారవేత్తను రంభ పెళ్లి చేసుకుంది..వీరికి పిల్లలు అయినా తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి..ఇంద్రన్‌కు 2003లోనే దుశ్యంతి సెల్వవినాయకమ్ అనే యువతితో పెళ్లయిందని, ఆ విషయం దాచిపెట్టి తనను పెళ్లిచేసుకున్నాడని రంభ ఆరోపిస్తోంది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు బాగా ఎక్కువయ్యాయి.ఈ నేపథ్యం లో మైనర్ పిల్లలు తన దగ్గరే ఉంచాలని రంభ కోర్ట్ లో దాఖలాలు చేసింది..కోర్టు తదుపరి విచారణను 2017 జనవరి 21కి వాయిదా వేసింది. 
మరి అప్పుడు విచారణ జరిపి పిల్లలు రంభ కు ఇస్తారో లేక ఇంద్రన్ కు ఇస్తారో చూడాలి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com