జయ అంత్యక్రియలు పూర్తి

- December 06, 2016 , by Maagulf
జయ అంత్యక్రియలు పూర్తి

అశేష జనవాహిని అశ్రునయనాల మధ్యకేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జయలలిత అంత్యక్రియలు చెన్నై మెరీనా బీచ్‌లో పూర్తయ్యాయి. జయలలిత రాజకీయ గురువు ఎంజేఆర్‌ సమాధికి సమీపంలోనే ఆమెను ఖననం చేశారు. త్రివిధ దళాల సైనికాధికారులు గౌరవ వందనం సమర్పించగా, వైష్ణవ గురువు పర్యవేక్షణలో శశికళ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, త్రివిధ దళాల అధికారులు అంత్యక్రియల క్రతువులో పాల్గొన్నారు.

అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు 
కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాధాకృష్ణన్‌లు అంత్యక్రియలకు హాజరయ్యారు.తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, తంబిదురై, మాజీ గవర్నర్‌ రోశయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌నేత గులాంనబీ ఆజాద్‌, ఏఐఏడీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తదితరులు జయలలిత పార్థివదేహం వద్ద చివరిసారిగా నివాళులర్పించారు. అమ్మను కడసారి చూసేందుకు వచ్చిన అశేష జనంతో మెరీనా బీచ్‌ కన్నీటి సంద్రమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com