జయ అంత్యక్రియలు పూర్తి
- December 06, 2016
అశేష జనవాహిని అశ్రునయనాల మధ్యకేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జయలలిత అంత్యక్రియలు చెన్నై మెరీనా బీచ్లో పూర్తయ్యాయి. జయలలిత రాజకీయ గురువు ఎంజేఆర్ సమాధికి సమీపంలోనే ఆమెను ఖననం చేశారు. త్రివిధ దళాల సైనికాధికారులు గౌరవ వందనం సమర్పించగా, వైష్ణవ గురువు పర్యవేక్షణలో శశికళ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్రావు, త్రివిధ దళాల అధికారులు అంత్యక్రియల క్రతువులో పాల్గొన్నారు.
అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు
కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాధాకృష్ణన్లు అంత్యక్రియలకు హాజరయ్యారు.తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, తంబిదురై, మాజీ గవర్నర్ రోశయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్గాంధీ, కాంగ్రెస్నేత గులాంనబీ ఆజాద్, ఏఐఏడీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తదితరులు జయలలిత పార్థివదేహం వద్ద చివరిసారిగా నివాళులర్పించారు. అమ్మను కడసారి చూసేందుకు వచ్చిన అశేష జనంతో మెరీనా బీచ్ కన్నీటి సంద్రమైంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









