800 మంది పర్యాటకులు అండమాన్‌లో చిక్కుకుపోయారు..

- December 06, 2016 , by Maagulf
800 మంది పర్యాటకులు అండమాన్‌లో చిక్కుకుపోయారు..

పర్యాటక ప్రాంతమైన అండమాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు అక్కడికి వెళ్లిన దాదాపు 800 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి మేరకు వారిని రక్షించేందుకు భారత నావికాదళం రంగంలోకి దిగింది. పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నావికా దళానికి చెందిన ఓడలను అండమాన్‌కు పంపించారు. ఐఎన్‌ఎస్‌ బిత్రా, బంగారం, కుంభీర్‌, ఎల్‌సీయూ-38 ఓడలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సహాయచర్యలపై నావికాదళ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com