రుణభారంతో ఒంగిన 'అట్లాస్' - ఆస్తుల విక్రయానికై నిర్ణయం
- September 03, 2015
500 మిలియన్ దినారాల అప్పుల ఊబిలో కూరుకుపోయిన అట్లాస్ జువెల్లరీ, రుణాలను తిరిగి చెల్లించడానికి, GCC దేశాలన్నిటా ఉన్న తమ అన్ని ఆస్తులను విక్రయించ పూనుకుంది. దుబాయి లోని యునైటెడ్ నేషనల్ బాంకు ఆవరణలో అతిరహస్యంగా ఏర్పాటుచేయబడిన సమావేశంలో, సంస్థ యజమాని భార్య ఐన శ్రీమతి ఇందిరా రామచంద్రన్, తమకు రుణాలిచ్చిన 20 బాంకుల వారితో వివిధ రకాల రుణచెల్లింపు అవకాశాలను గురించి ఈ బుధవారం చర్చించారు. GCC లో 35, యూ. ఏ. ఈ. లో 19 ఆభరణాల దుఖానాలను, రెండు ఆసుపత్రులను కలిగియున్న గ్రూపు అధినేత ఎమ్.ఎమ్. రామచంద్రన్ కు బెయిలు లభించని కారణంగా ఆయన తరపున సంస్థ కమ్యునికేషన్స్ హెడ్ - శ్రీ శ్యాం మోహన్ మాట్లాడుతూ, తమ సంస్థ ప్రతి ఒక్క రుణాన్ని పూర్తిగా తీర్చడానికే కట్టుబడిందని, అందుకై ఆస్తుల విక్రయ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ విధమైన ఎత్తుపల్లాలు సాధారణమని, చిరకాలం నుండి కాలపరీక్ష కు నిలబడి నిలిచిన సంస్థ ఆర్ధిక మూలాలు ఈ సమస్యలను తరిమి కొట్ట గలిగినంత సుస్థిరమైనవని ధీమా వ్యక్తం చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







