రుణభారంతో ఒంగిన 'అట్లాస్' - ఆస్తుల విక్రయానికై నిర్ణయం
- September 03, 2015
500 మిలియన్ దినారాల అప్పుల ఊబిలో కూరుకుపోయిన అట్లాస్ జువెల్లరీ, రుణాలను తిరిగి చెల్లించడానికి, GCC దేశాలన్నిటా ఉన్న తమ అన్ని ఆస్తులను విక్రయించ పూనుకుంది. దుబాయి లోని యునైటెడ్ నేషనల్ బాంకు ఆవరణలో అతిరహస్యంగా ఏర్పాటుచేయబడిన సమావేశంలో, సంస్థ యజమాని భార్య ఐన శ్రీమతి ఇందిరా రామచంద్రన్, తమకు రుణాలిచ్చిన 20 బాంకుల వారితో వివిధ రకాల రుణచెల్లింపు అవకాశాలను గురించి ఈ బుధవారం చర్చించారు. GCC లో 35, యూ. ఏ. ఈ. లో 19 ఆభరణాల దుఖానాలను, రెండు ఆసుపత్రులను కలిగియున్న గ్రూపు అధినేత ఎమ్.ఎమ్. రామచంద్రన్ కు బెయిలు లభించని కారణంగా ఆయన తరపున సంస్థ కమ్యునికేషన్స్ హెడ్ - శ్రీ శ్యాం మోహన్ మాట్లాడుతూ, తమ సంస్థ ప్రతి ఒక్క రుణాన్ని పూర్తిగా తీర్చడానికే కట్టుబడిందని, అందుకై ఆస్తుల విక్రయ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ విధమైన ఎత్తుపల్లాలు సాధారణమని, చిరకాలం నుండి కాలపరీక్ష కు నిలబడి నిలిచిన సంస్థ ఆర్ధిక మూలాలు ఈ సమస్యలను తరిమి కొట్ట గలిగినంత సుస్థిరమైనవని ధీమా వ్యక్తం చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







