మస్కట్ ఎయిర్ పోర్ట్ రన్ వే పనుల వల్ల ముందే కూసే కోయిలలకు ఆలస్యం
- September 03, 2015
ఒమాన్ దేశ రాజధాని మస్కట్కు వేకువ ఝామునే రాకపోకలు సాగించే ప్రయాణీకులకు, నిర్వహణ పనుల నిమిత్తం, రన్వే ను మూసివేయమని అప్పుడప్పుడు అధికారులు ఇచ్చే ఆజ్ఞల వలన వారానికి 3 సార్లు ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం, ఒమాన్ ఏర్ పోర్ట్స్ మానేజ్ మెంట్ కంపెనీ వారు ఆది, సోమ, మరయు బుధవారాల్లో ఉదయం 5 30 నుండి 6 30 వరకు రన్ వే ను మూసివేయటం వల్ల, ప్రయాణీకులకు, ఏర్ లైన్స్ వారికి కూడా వివిధ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం అనివార్యమౌతోంది. (OAMC) ఈ విషయమై OAMC టెక్నికల్ సర్వీసెస్ జనరల్ మానేజర్ సేయిడ్ క్ అల్ జద్ జల్లి మాట్లాడుతూ, ఇది 'నోటిస్ టు ఏర్ మన్' ద్వారా జరిగే సాధారణ ప్రక్రియ అని, సమయనుసారంగా విమానాశ్రయ నిర్వహణ ప్రపంచమంతటా విమానాశ్రయాలలో జరిగే అతి ముఖ్య ప్రక్రియ అని, ఇది త్వరలోనే ముగియనున్నదనీ ఆయా హామీ ఇచ్చారు. ఈ విషయమై తమకు సహకరిస్తున్న ప్రయాణీకుల్ౌ, ఏర్ లైన్స్ వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







