సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- January 21, 2026
దమ్మామ్: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ తూర్పు ప్రావిన్స్లోని ఎయిర్ వార్ఫేర్ సెంటర్లో “స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026” మిలిటరీ ఎక్సర్ సైజ్ ను ప్రారంభించింది. నేషనల్ గార్డ్ మంత్రిత్వ శాఖ, స్టేట్ సెక్యూరిటీ ప్రెసిడెన్సీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యూనిఫైడ్ మిలిటరీ కమాండ్ మరియు 15 మిత్ర దేశాలు, భాగస్వామ్య దేశాల సైనిక దళాలతో పాటు సౌదీ సాయుధ దళాలు ఇందులో పాల్గొంటున్నట్లు వెల్లడించింది.
ఈ ప్రాంతంలో అతిపెద్ద వైమానిక విన్యాసాలలో ఒకటైన స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026, సైనిక భాగస్వామ్యాలను మెరుగుపరచడం, ప్రణాళిక అమలులో నైపుణ్య మార్పిడిని బలోపేతం చేయడం, పోరాట సంసిద్ధతను పెంచడం మరియు పాల్గొనే దళాల మధ్య అధునాతన స్థాయి కార్యాచరణ సమన్వయాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ఎక్సర్ సైజ ఎలక్ట్రానిక్ మరియు సైబర్ వార్ఫేర్తో సహా ఆధునిక సైనిక వ్యూహాలను కూడా సమీక్షిస్తుందని పేర్కొంది. ఈ సైనిక వ్యాయామంలో బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, జోర్డాన్, మలేషియా, మొరాకో, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, టర్కియే, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి వచ్చిన సాయుధ దళాలు తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









