తెలుగు మీడియం చదువుకున్న వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ...
- December 08, 2016తెలుగు మీడియంలో చదువుకున్న యువకులకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నిస్తామని మంత్రి పల్లె రఘునాధరెడ్డి వెల్లడించారు. తిరుపతిలో గురువారం జరిగిన తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి అధ్యయన కమిటీ సమావేశానికి పల్లె అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి తెలుగు భాషా పండితులు, సాహితీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు మీడియం చదువుకుంటే ఉద్యోగాలు రావనే అభిప్రాయం సమాజంలో బలంగా ఉంది. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం తెలుగు మీడియం చదువుకున్న వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని వారు మంత్రిని కోరారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇంటర్ వరకు తెలుగును తప్పని సరి చేస్తామని, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, కాలేజీలు కూడా ఈ నిబంధన వర్తింపజేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు, కోర్టు తీర్పలు మాతృభాషలో వచ్చేలా, అధికారులు ప్రజలతో తెలుగులోనే మాట్లాడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ