తెలుగు మీడియం చదువుకున్న వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ...
- December 08, 2016
తెలుగు మీడియంలో చదువుకున్న యువకులకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నిస్తామని మంత్రి పల్లె రఘునాధరెడ్డి వెల్లడించారు. తిరుపతిలో గురువారం జరిగిన తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి అధ్యయన కమిటీ సమావేశానికి పల్లె అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి తెలుగు భాషా పండితులు, సాహితీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు మీడియం చదువుకుంటే ఉద్యోగాలు రావనే అభిప్రాయం సమాజంలో బలంగా ఉంది. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం తెలుగు మీడియం చదువుకున్న వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని వారు మంత్రిని కోరారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇంటర్ వరకు తెలుగును తప్పని సరి చేస్తామని, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, కాలేజీలు కూడా ఈ నిబంధన వర్తింపజేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు, కోర్టు తీర్పలు మాతృభాషలో వచ్చేలా, అధికారులు ప్రజలతో తెలుగులోనే మాట్లాడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









