'ఓటుకు నోటు' కేసులో వెలువడిన కోర్టు తీర్పు చంద్రబాబు నిజాయితీని రుజువుచేసింది .

- December 09, 2016 , by Maagulf
'ఓటుకు నోటు' కేసులో వెలువడిన కోర్టు తీర్పు చంద్రబాబు నిజాయితీని రుజువుచేసింది .

'ఓటుకు నోటు' కేసులో వెలువడిన కోర్టు తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజాయితీని మరోమారు రుజువుచేసిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తెలంగాణాలో జరిగిన సంఘటనలకు సంబంధం లేని చంద్రబాబునాయుడును అల్లరి చేయాలనే దురుద్దేశంతో ప్రతిపక్షాలు పన్నాగం పన్నుతున్నాయని ఆరోపించారు. నీతి, నిజాయితీలతో నిబద్దత గల రాజకీయ వేత్తగా బాబు తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎంను విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. నైతిక బాధ్యతతో రోజుకు 18 గంటలు పనిచేస్తున్న చంద్రబాబు నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శమని రవీంద్ర అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com