వర్ద తుపాను క్రమంగా బలపడుతూ తీవ్ర తుపానుగా మారింది...

- December 09, 2016 , by Maagulf
వర్ద తుపాను క్రమంగా బలపడుతూ తీవ్ర తుపానుగా మారింది...

 ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వర్ద తుపాను క్రమంగా బలపడుతూ తీవ్ర తుపానుగా మారిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 840 కి.మీ దూరంలో , మచిలీపట్నానికి ఆగ్నేయంగా 930 కి.మీ దూరంలో వర్ద కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అన్ని ప్రధాన పోర్టుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com