బోకోహారమ్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడుల్లో 30 మంది మృతి
- December 10, 2016
బోకోహారమ్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 30 మందికి పైగా మృతి చెందిన ఘటన ఈశాన్య నైజీరియాలో చోటుచేసుకుంది. మదగలి ప్రాంతంలోని రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద ఇద్దరు మహిళా ఉగ్రవాదులు శుక్రవారం ఆత్మాహుతి దాడి చేశారు.
మార్కెట్కు రెండు వైపులా ఇద్దరు మహిళలు తమను తాము శక్తివంతమైన బాంబులతో పేల్చేసుకున్నారని స్థానిక ప్రభుత్వ చైర్మన్ యూసుఫ్ మహ్మద్ వెల్లడించారు. ఈ ఘటనలో మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బోకోహారమ్ ఉగ్రవాదులు వందలాది మందిని కిడ్నాప్ చేసి ప్రజలను మానవబాంబులుగా వాడుతున్నారని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









