బోకోహారమ్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడుల్లో 30 మంది మృతి
- December 10, 2016
బోకోహారమ్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 30 మందికి పైగా మృతి చెందిన ఘటన ఈశాన్య నైజీరియాలో చోటుచేసుకుంది. మదగలి ప్రాంతంలోని రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద ఇద్దరు మహిళా ఉగ్రవాదులు శుక్రవారం ఆత్మాహుతి దాడి చేశారు.
మార్కెట్కు రెండు వైపులా ఇద్దరు మహిళలు తమను తాము శక్తివంతమైన బాంబులతో పేల్చేసుకున్నారని స్థానిక ప్రభుత్వ చైర్మన్ యూసుఫ్ మహ్మద్ వెల్లడించారు. ఈ ఘటనలో మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బోకోహారమ్ ఉగ్రవాదులు వందలాది మందిని కిడ్నాప్ చేసి ప్రజలను మానవబాంబులుగా వాడుతున్నారని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







