తెలుగు వారిని నయవంచన చేస్తున్న భారత్ కేంద్ర ప్రభుత్వం
- September 04, 2015
ఆరాటం తీరాలంటే పోరాటాలే చెయ్యాలా..? చంద్రబాబుది మధ్యే మార్గమా? రావాల్సిన ప్రత్యేక హోదా రాదని తేలిపోయింది. రోడ్డు మ్యాపులేసి గీసిన గీతలే మళ్ళీ మళ్ళీ గీసి అరిగిపోయిన గ్రాంఫోను రికార్డుల్ని మోగిస్తున్న కేంద్రం మీద ఆశలు వదిలేసుకోవాలని చెప్పక తప్పదు. కావాల్సింది నిధులేగా...ఏ రాయైతేనేం పళ్ళూడ గొట్టుకోవడానికని అనుకోవడానికి వీల్లేదు! ఆ బీహారుకు మోడీ ప్రకటించిన లక్షాపాతికవేల కోట్లు ఎన్నికల ముందు చేసిన వాగ్దానం అని ఎందుకనుకోకూడదు? నోటి మాటే కదా..అక్కడ బీజేపీ గెల్చినా అంతంత డబ్బు ఇస్తాడన్న గ్యారెంటీ లేదు. మరేం చెయ్యాలి..చంద్రబాబు కింకర్తవ్యం ఏంటి..? అసలే కులరాజకీయాలు,ముఠాతగాదాలు,కాంట్రాక్టర్ల కుమ్ములాటలతో కునారిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే..ఏం చెయ్యాలి..జవాబు జనం నుంచి రావాలి.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







