కిడ్నాప్ కేసులో టీనేజర్కి జైలు
- December 14, 2016
మనామా: 20 ఏళ్ళ యువకుడికి కిడ్నానప్ కేసులో జైలు విక్ష పడింది. హై క్రిమినల్ కోర్ట్ ఆ యువకుడికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. బహ్రెయినీ వ్యక్తిని కిడ్నాప్ చేసి, శారీరకంగా హింసించినట్లు నిందితుడిపై ఆరోపణలు రుజువయ్యాయి. తన కజిన్తో ఇంకో యువకుడు సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. కజిన్పై ఒత్తిడి చేసి, బాధితుడ్ని జుఫైర్కి రప్పించి, నిందితుడు అతని స్నేహితులు కారులోకి లాగి, కళ్ళకు గంతలు కట్టారు. ఆ తర్వాత రెండు గంటలపాటు అతన్ని బంధించారు. రెండు గంటలపాటు తనపై దాడి చేశారనీ, ఆ తర్వాత తనను విడిచిపెట్టారని బాధితుడు తెలిపాడు. తన ఫోన్ని కూడా నిందితులు లాక్కున్నట్లు బాధితుడు చెప్పాడు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







