రేపు అమరావతి సచివాలయంలో జరగనున్న రెండు కీలక సమావేశాలు
- December 14, 2016
అమరావతి సచివాలయంలో గురువారం రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. కేబినెట్ భేటీతో పాటు శాఖాధిపతుల సమావేశం కూడా సెక్రటేరియట్లో జరగనుంది. మూడో త్రైమాసికం ముగుస్తుండటం, శాఖల వారీగా వృద్ధిరేటు, త్వరలో జరగబోయే కలెక్టర్ల సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. పెద్ద నోట్ల రద్దు.. తాజా పరిస్థితిపైనా మంత్రివర్గం సమీక్షించనుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వెలగపూడి సచివాలయంలో గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరగనుంది. అంతకుముందు ఉదయం 11 గంటలకు శాఖాధిపతుల సమావేశం జరగనుంది. మొత్తం అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు శాఖాధిపతులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే కలెక్టర్ల సమావేశానికి ముందు జరుగుతున్న భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెలాఖరుకు మూడో క్వార్టర్ ముగుస్తుండటంతో ఆర్థిక వృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు. పెద్ద నోట్ల రద్దు, శాఖల వారిగా ప్రభావంపై చర్చించనున్నారు. ఇప్పటి వరకు బడ్జెట్ నిధుల విడుదల, వ్యయంపైనా సీఎం వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం రెండున్నరకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. నోట్ల రద్దు పైనే చర్చ జరగనుంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితి, ప్రజల ఇబ్బందుల ఫై కాబినెట్ చర్చించనుంది. త్వరలో రానున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు గతంలో మాదిరిగా చంద్రన్న కానుకలు ఇవ్వనుంది ప్రభుత్వం. దీనిపైనా చర్చించనున్నారు. కొత్త ఏడాదిలో కొన్ని కొత్త పథకాలు పెట్టే ఆలోచనలో ఉంది సర్కార్. దీనిపై మంత్రుల అభిప్రాయాలూ తీసుకోనున్నారు సీఎం. అటు జనవరిలో జరిగే జన్మభూమి కార్యక్రమం విజయవంతమవడానికి తీసుకోవాలసిన చర్యలపై సీఎం దిశా నిర్దేశం చేస్తారు. పట్టణాల్లో భవనాల నిర్మాణాలకు ఆన్లైన్ విధానం అమలుకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. కొన్ని జిల్లాల్లో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది మంత్రివర్గం. ఒకే రోజు రెండు కీలక సమావేశాలు ఉండటంతో మొత్తం పాలనా యంత్రాంగం అంతా సచివాలయానికి రానుంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







