'వీఐపీ 2' కి క్లాప్ కొట్టిన రజినీకాంత్
- December 15, 2016
ధనుష్ కథానాయకుడిగా సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న 'వీఐపీ 2' చిత్రం షూటింగ్ను ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సూపర్స్టార్ రజనీకాంత్, ఆయన సతీమణి లత, కథానాయిక అమలాపాల్, నిర్మాత కలైపులి ఎస్ థను, నటుడు వివేక్ తదితరులు హాజరయ్యారు. రజనీకాంత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి, కుమార్తె సౌందర్య రజనీకాంత్ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తలైవా చిత్ర బృందాన్ని విష్ చేస్తూ ట్వీట్ చేశారు. షూటింగ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో తీసిన ఫొటోలను ధనుష్, సౌందర్య ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
'ఇంతకు మించి నేనేం అడగగలను? ధన్యవాదాలు తలైవా. మీ అందరి ఆశీర్వాదాలతో షూటింగ్ ఇవాళ ప్రారంభమైంది. రఘువరన్ ఈజ్ బ్యాక్' అని ధనుష్ ట్వీట్ చేశారు. అదేవిధంగా సౌందర్య కూడా తల్లిదండ్రులు లత, రజనీకాంత్లకు ధన్యవాదాలు తెలిపారు. అందరి ఆశీర్వాదాలు కావాలని ట్వీట్ చేశారు. 2014లో విడుదలైన 'రఘువరన్ బీటెక్' చిత్రానికి సీక్వెల్గా 'వీఐపీ 2'ని తెరకెక్కిస్తున్నారు.


తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







